ప్రపంచ మాదకద్రవ్యాల నిర్మూలన దినోత్సవం సందర్భంగా బుధవారం కొండమల్లేపల్లిలో పోలీసుల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. యువత తమ శక్తియుక్తులను డ్రగ్స్ మాయలో పడి వృథా చేసుకోవద్దని, ఒక్కసారి డ్రగ్స్ వాడినా సరే మెల్లమెల్లగా వ్యసనంగా మారే ప్రమాదం ఉందని, డ్రగ్స్ మీద పోలీసులు చేస్తున్న పోరాటంలో యువత పాలుపంచుకోవాలని పోలీసులు అన్నారు. ఈ కార్యక్రమంలో సిఐ ధనుంజయ గౌడ్, ఎస్ఐ రామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు.