నల్లగొండలోని పానగల్లు రోడ్డులో గల శివరాం నగర్ కాలనీకి చెందిన ఓ ఇంట్లో మంగళవారం గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. టూ టౌన్ ఎస్ఐ నాగరాజు తెలిపిన వివరాల ప్రకారం ఆ కాలనీకి చెందిన తీగల సృజన ఇంటి తాళాన్ని గుర్తు తెలియని వ్యక్తులు పగలగొట్టి బీరువాలో ఉన్న పది తులాల వెండి వస్తువులు ఎత్తుకెళ్లినట్లు తెలిపారు. బాధితురాలు ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.