భాగ్యనగర్ శ్రీ మహంకాళి జాతర బోనాల ఉత్సవాల ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ చైర్మన్ గాజుల అంజయ్యను తెలంగాణ వారాల సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. మీరాలంమండిలోని మహంకాళేశ్వర దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం గాజుల అంజయ్యను సంఘం చైర్మన్ కొరిగింజ శ్రీరాములు, ముఖ్య సలహాదారులు గాజుల కృష్ణ, అధ్యక్షుడు గాజుల చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఈ సన్మాన కార్యక్రమం జరిగింది.