ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రైస్ మిల్లర్స్ అసోసియేషన్ తో సమావేశమైన ఎంపీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, May 02, 2024, 04:10 PM

మిర్యాలగూడ నియోజకవర్గంలో మిర్యాలగూడ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ తో నల్లగొండ బిజెపి పార్లమెంట్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలందరూ నరేంద్ర మోడీ మళ్లీ ప్రధాని కావాలి అని కోరుకుంటున్నారని అన్నారు. ఈ దేశం బాగుపడాలంటే ఈ అభివృద్ధి ఆగకుండా ఉండాలంటే మళ్లీ మోడీ ప్రధాని కావాలని, అందుకని ఆలోచించండి రేపు ఈ దేశం భద్రంగా ఉండాలంటే మోడీ చేతులయితేనే భద్రంగా ఉంటది కాబట్టి మీరు మతాలు కులాలు పార్టీలు అన్నీ చూడకుండా మీరు వేసే ఓటు కమలం గుర్తు మీద ఓటు వేసి గెలిపించాలని కోరారు.
మోడీ సంవత్సరానికి 6000 చొప్పున 3 విడతలుగా రైతులకి బ్యాంక్ ఖాతాలోకి వేస్తోందని, యూరియా మీద గాని డీఏపీ గాని ఎకరానికి 18 వేల రూపాయలు సబ్సిడీ అందిస్తుందని, మన నరేంద్ర మోడీ ప్రపంచం మొత్తం మన దేశం వైపు చూసే విధంగా పనిచేస్తామన్నాడు అని, ఒక అవినీతి మచ్చ లేకుండా నరేంద్ర మోడీ కావాలా అసలు పేరే తెలియని రాహుల్ గాంధీ కావాలా ఒకసారి ఆలోచించండి అని అన్నారు. 24 ఏళ్ల నుండి ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా పనిచేసే నాయకుడు ఎవరంటే మన నరేంద్ర మోడీ అని, మన దేశం కోసమే బ్రతుకుతున్నారు అని అన్నారు.


మీ అభ్యర్థి పార్లమెంట్లో ఉంటే ఈ పార్లమెంటుకి మనం ఏదైనా చేయగలుగుతాం మీ అందరికీ తెలుసు ఈసారి నరేంద్ర మోడీ గారు 400 సీట్లు తో గెలవబోతున్నాడు. కాబట్టి దయచేసి మీరు రేపు జరిగే ఎన్నికల్లో నరేంద్ర మోడీ కమలం గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు గౌరు శ్రీనివాస్, ఉపాధ్యక్షులు గంట సంతోష్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి జి.బాబీ, రాష్ట్ర ఉపాధ్యక్షులు కర్నాటి రమేష్, దన్ మల్లయ్య, కర్నాటి ప్రభాకర్, సాధినేని శ్రీనివాస రావు, సీతారాం రెడ్డి, అశోక్ రెడ్డి గార్లు తదితరులు పాల్గొన్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com