రెండో విడత ఇంటింటికి బీజేపీ సంకల్ప పత్రం చేర్చే కార్యక్రమం ఆదివారం బీజేపీ నాయకులు నిర్వహించారు. ఈ సందర్భంగా పాలేరు నియోజకవర్గం బూత్ నెంబర్ 236, 237లో జిల్లా ప్రధాన కార్యదర్శి నున్నా రవికుమార్ పాల్గోని ఇంటింటికి తిరిగి ప్రచారం చేస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ. ఎమ్మార్పీఎస్, జనసేన, టీడీపీ బలపరిచిన ఖమ్మం లోక్ సభ బీజేపీ అభ్యర్థి తాండ్ర వినోద రావును గెలిపించాలని అభ్యర్థించారు.