జూలూరుపాడు మండలంలో వేసవికాలం మొదటి నుంచే భానుడు భగభగ మండుతున్నాడు. ఇప్పటికే పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతూ వస్తున్నాయి పిల్లలు, వృద్ధులు, ఎండ వేడిమికి తట్టుకోలేకపోతున్నారు. ఉదయం 10 దాటితే చాలు ఉక్క పోతతో పెద్దలు సైతం తట్టుకోలేకపోతున్నారు. భానుడి ప్రతాపానికి రోడ్లన్నీ నిర్మానుషంగా మారుతున్నాయి. ఎండాకాలం ఉష్ణోగ్రతల నుంచి బయటపడాలంటే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.