కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని లింగాపూర్ గ్రామ పరిధిలో కల్కి నగర్ కోటిలింగేశ్వర అభయంజనేయ స్వామి ఆలయ పూజారి మచ్చంద్రప్రసాద్ శర్మ 41 రోజులపాటు కామారెడ్డి నుంచి కాశీ వరకు పాదయాత్ర పూర్తి చేసుకుని కామారెడ్డికి వచ్చిన సందర్భంగా శుక్రవారం భక్తులు ఘన స్వాగతం పలికారు. కోటిలింగేశ్వర ఆలయం పూజారి మచ్చేoద్రప్రసాద్ శర్మ దంపతులను భక్తులు ఘనంగా సన్మానించారు. మార్గమధ్యలో ఉన్న వివిధ దేవాలయాలను సందర్శించారు.