బిజెపి గత పదిహేళ్లుగా పేదల కోసం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే ఈ ఎన్నికల్లో పార్టీని గెలిపిస్తాయని బిజెపి జోగులాంబ గద్వాల జిల్లా అధ్యక్షుడు రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. శనివారం అయిజ మండలంలోని సిటీపాడు గ్రామంలో నిర్వహించిన లోక్ సభ ఎన్నికల ప్రచారంలో కేంద్ర ప్రభుత్వ పథకాలను ఇంటింటికి తిరిగి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు గోపాలకృష్ణ, నాయకులు అంజి, భీమన్న, సతీష్ తదితరులు పాల్గొన్నారు.