భిక్కనూరు మండలంలోని తిప్పాపూర్ గ్రామానికి చెందిన పలువురు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. అనంతరం మాట్లాడుతూ, అన్ని వర్గాల సంక్షేమానికి సీఎం రేవంత్ రెడ్డి ఎన్నో పథకాలను అమలు చేస్తున్నారని గుర్తు చేశారు. పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించాలని తెలిపారు.