ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సీఎం రేవంత్ కుట్ర చేస్తున్నారు.. కంటతడి పెట్టిన మాజీ మంత్రి మోత్కుపల్లి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Apr 18, 2024, 07:26 PM

పార్లమెంట్ ఎన్నికల్లో మాదిగలకు అన్యాయం జరుగుతోందని మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత మోత్కుపల్లి నర్సింహులు ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ఎంపీ ఎన్నికల్లో రెండు సీట్లు కేటాయించాలని డిమాండ్‌ చేస్తూ బేగంపేట లీలానగర్‌లోని తన నివాసంలో నిరసన దీక్ష చేపట్టారు. కాంగ్రెస్‌లో మాదిగలకు తీవ్ర అన్యాయం జరుగుతుందోని.. బీఆర్‌ఎస్‌, బీజేపీ రెండేసి టికెట్లు కేటాయిస్తే.. కాంగ్రెస్ మాత్రం ఒక్కరికీ కూడా టికెట్ ఇవ్వలేదన్నారు.


తనకు టికెట్ రాకుండా సీఎం రేవంత్ రెడ్డి కుట్ర చేస్తున్నారని కంటతడి పెట్టుకున్నారు. బయట నుంచి వచ్చిన వాళ్లకే టికెట్లు ఇస్తున్నారని కన్నీటి పర్యంతమయ్యారు. కనీసం ఒక్క టికెట్ అయినా మాదిగలకు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. తాను చాలా మంది సీఎంలతో కలిసి పనిచేశానని.. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయన్నారు. సీఎం రేవంత్ రెడ్డిని కలవాలంటే అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వడం లేదని ఆయన కన్నీటి పర్యంతమయ్యారు. బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ బాటలోనే రేవంత్ నడుస్తున్నారని విమర్శించారు.


ఇప్పటి వరకు ఒక్క మంచి నిర్ణయం కూడా తీసుకోలేదన్నారు. పథకాలను మాత్రమే చూసి జనం ఓట్లు వేయరన్నారు. తాను చస్తేనే మాదిగలకు టికెట్ ఇస్తారా ? అని ప్రశ్నించారు. ఇదే తన చివరి ప్రెస్ మీట్ అని భావోద్వేగానికి గురయ్యారు. మాదిగలకు టికెట్ల విషయమై.. మంద కృష్ణ మాదిగ మాట్లాడిన దాంట్లో తప్పు లేదన్నారు. తమ జాతికి జరుగుతున్న అన్యాయాలపై ఆయన సరిగానే స్పందించారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి నష్టం జరగాలని తాను మాట్లాడటం లేదని.. ఎట్టి పరిస్థితిల్లోనూ తాను పార్టీ మారే ప్రసక్తే లేదని మోత్కుపల్లి స్పష్టం చేశారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com