ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈసీ నోటీసులపై గులాబీ బాస్ కేసీఆర్ స్పందన

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Apr 18, 2024, 07:20 PM

తెలంగాణలో రాజకీయాలు రోజు రోజుకు రసవత్తరంగా మారుతున్నాయి. త్వరలో జరగనున్న లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో.. పొలిటికల్ హీట్ పెరిగింది. అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. విమర్శలు, ప్రతివిమర్శలు, ఆరోపణలు ప్రత్యారోపణలతో హాట్ హాట్‌గా ప్రచార పర్వం నడుస్తోంది. ఈ నేపథ్యంలోనే.. బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు ఈసీ నోటీసులు జారీ చేయటం చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ నేత నిరంజన్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు.. ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించారని, వెంటనే తాను చేసిన కామెంట్లకు వివరణ ఇవ్వాలంటూ కేసీఆర్‌‌కు నోటీసులు జారీ చేయగా.. వాటిపై కేసీఆర్ స్పందించారు. వివరణ ఇచ్చేందుకు మరో వారం రోజులు గడువు కావాలంటూ ఎలక్షన్ కమిష‌న్‌కు కేసీఆర్ విజ్ఞప్తి చేశారు.


ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో.. ఓటమిపాలైన బీఆర్ఎస్ పార్టీ ఈ లోక్‌సభ ఎన్నికల్లో అధిక స్థానాలు గెలుచుకుని సత్తా చాటాలని కృషి చేస్తోంది. ఇందుకోసం బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కల్వకుంట్ల చంధ్రశేఖర్ రావు నేరుగా రంగంలోకి దిగారు. బీఆర్ఎస్ మీద సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు చేస్తున్న విమర్శలకు తనదైన శైలిలో.. మళ్లీ ఉద్యమకాలంలోని నాయకున్ని గుర్తుచేసేలా కేసీఆర్ కౌంటర్లు వేస్తున్నారు.


ఈ క్రమంలోనే.. ఇటీవలే నిర్వహించిన సిరిసిల్ల సభలో కాంగ్రెస్ నేతలపై కేసీఆర్ ఓ రేంజ్‌లో విరుచుకుపడ్డారు. ముఖ్యంగా.. సీఎం రేవంత్‌ రెడ్డితో పాటు మంత్రి కోమటిరెడ్డి, సిరిసిల్ల నేత కేకే మహేందర్ రెడ్డి టార్గెట్‌గా కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ.. కాంగ్రెస నేత నిరంజన్ రెడ్డి ఎలక్షన్ కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు మేరకు కేసీఆర్‌కు ఈసీ నోటీసులు ఇవ్వగా.. వివరణ కోసం తనకు సమయం ఇవ్వాలని కోరారు. కేసీఆర్ అభ్యర్థనపై మరి ఈసీ ఎలా స్పందిస్తుందో చూడాలి.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com