ఎల్లారెడ్డి సెగ్మెంట్బ్ లింగంపేట్ మండలంలోని ఐలాపూర్ గ్రామ మురికి కాల్వలో గురువారం పసికందు మృతదేహాన్ని గ్రామస్తులు గుర్తించారు. వెంటనే లింగంపేట్ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు హుటాహుటిన గ్రామానికి చేరుకుని మురికి కాల్వలోని మగశిశివును శవాన్నిగుర్తించి బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ. చైతన్య తెలిపారు.