బాలసదనంలో ఉంటూ ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే ఇద్దరు బాలికలు కనిపించకుండా పోయారు. పాఠశాల నుంచి బయటకు వెళ్లిన వారు బాలసదనంకు రాకుండా ఎక్కడికి వెళ్లిపోయారని ఫిర్యాదు రావడంతో పట్టణ పోలీసులు విచారణ జరుపుతున్నారు. హరిజనవాడ జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో చదువుతున్న గంగోత్రి, నజియా ఈనెల 13న పాఠశాలకు వెళ్లి ఎవరికి చెప్పకుండా బయటకు వెళ్ళిపోయారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు సీఐ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు.