నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గం ప్రజలకు దేవరకొండ మాజీ ఎంఎల్ఏ రవీంద్ర నాయక్ బుధవారం శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మాజీ ఎంఎల్ఏ రవీంద్ర నాయక్ మాట్లాడుతూ.. ధర్మపాలనకు పెట్టింది పేరైన శ్రీరామచంద్రమూర్తి కరుణాకటాక్షాలు ప్రజలపై ఉండాలని కోరుకుంటున్నాను. సీతారాముల దయ మీ కుటుంబంపై ప్రసరించి, సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు కలగాలని ఆకాంక్షిస్తున్నాను అని అన్నారు.