ఏప్రిల్ 1 నుండి జిల్లా వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వి. పి. గౌతమ్ అధికారులను ఆదేశించారు.
గురువారం ఖమ్మం కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్లో సంబంధిత అధికారులతో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభంపై కలెక్టర్ అధికారులకు దిశా నిర్దేశం చేశారు. కోనుగోలు కేంద్రాల్లో కావల్సిన సామగ్రిని సమకూర్చుకుని రైతులు ఇబ్బంది పడకుండా అన్ని వసతులు కల్పించాలని సూచించారు.