వేసవి కాలం దృష్ట్యా ప్రజల దాహర్తిని తీర్చేందుకు తారకరామ ఆటో నగర్ ఆధ్వర్యంలో ఖమ్మం 46వ డివిజన్ ఎఫ్సీఐ రోడ్ వద్ద గురువారం ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని నగర అధ్యక్షుడు, పీసీసీ సభ్యులు మహమ్మద్ జావేద్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. బాటసారుల దాహార్తిని తీర్చేందుకు వేసవిలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఇటువంటి సామాజిక కార్యక్రమాలు చేపడుతున్న సొసైటీ బాధ్యులను అభినందించారు.