జోగులాంబ గద్వాల జిల్లా అయిజ పట్టణంలోని బాలుర ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రం వద్ద అధికారులకు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు మధ్య వాగ్వివాదం జరిగింది. బీఆర్ఎస్ నాయకులు పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లను ప్రభావితం చేస్తున్నారంటూ కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. దీంతో 15 నిమిషాల పాటు పోలీసులకు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది.