ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈఎస్ఐ బాలిక అత్యాచార నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Sep 19, 2023, 07:32 PM

హైదరాబాద్ సనత్‌నగర్ ఈఎస్ఐ ఆసుపత్రిలో ఓ పేషెంట్ సోదరి (మైనర్)పై సిబ్బంది అత్యాచారం చేసిన సంగతి తెలిసిందే. లిఫ్ట్ ఆపరేటర్ బాలిక నోట్లో గుడ్డలు కుక్కి ఘాతుకానికి పాల్పడ్డాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. తాజాగా.. పరారీలో ఉన్న నిందితుడు షాబాద్‌ను పోలీసులు అరెస్టు చేశారు. గత మూడు రోజులుగా అతడు పరారీలో ఉండగా.. ఎట్టకేలకు ఎస్‌ఆర్ నగర్ పోలీసులు అతడిని పట్టుకున్నారు. నిందితుడిపై కేసులు నమోదు చేసి మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా.. న్యాయస్థానం రిమాండ్ విధించింది. దీంతో షాబాద్‌ను జైలుకు తరలించారు.


కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఒక కుటుంబం వైద్యం కోసం సనత్ నగర్ ఈఎఎస్‌ఐ ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యింది. ఓ ప్రమాదంలో బాధిత బాలిక అన్నయ్యకు గాయాలు కాగా.. అక్కడే ఉండి ఫిజియోథెరపీ చేయిస్తోంది. అయితే ఆసుపత్రిలో తన అన్నయ్యకు తోడుగా ఉన్న బాలికపై అక్కడి క్యాంటీన్‌లో పని చేసే షాబాద్ కన్నేశాడు. ఈ క్రమంలో ఆమెతో పరిచయం పెంచుకున్నాడు. మూడ్రోజుల క్రితం తన అన్నయ్యకు ఆహారం తీసుకురావటానికి ఆసుపత్రి ఆరో అంతస్తుకు వెళ్లింది.


భోజనం తీసుకున్న తర్వాత కిందకు వెళ్లబోతుంటే షాబాద్ ఆమెను అడ్డుకున్నాడు. లిఫ్ట్‌లో రెండో అంతస్తుకు తీసుకెళ్లి నోట్లో గుడ్డలు కుక్కి ఆమెపై అత్యాచారం చేశాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. బాధిత బాలిక తనపై అత్యాచారం జరిగిందని ఆసుపత్రి సిబ్బందికి చెప్పగా.. వైద్యులు ఆమెకు పరీక్షలు నిర్వహించారు. అత్యాచారం జరిగినట్లు నిర్ధరణ కావటంతో వెంటనే బాధిత బాలిక ఎస్‌ఆర్ నగర్ పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు షాబాద్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించాడు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com