హైదరాబాద్ ఔటర్రింగ్ రోడ్డుపై నార్సింగి వద్ద 29.50కోట్ల రూపాయలతో నిర్మించిన ఇంటర్ఛేంజ్ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ ప్రజల విజ్ఞప్తి మేరకు ఓఆర్ఆర్పై 120కి.మీ. వరకు వాహనాల స్పీడు పెంచామని అన్నారు. మూసీ నదిపై 14 బ్రిడ్జ్ల నిర్మాణానికి అనుమతులిచ్చామని, శంషాబాద్ నుంచి మూసీ వరకు ఎక్స్ప్రెస్వే నిర్మిస్తామని తెలిపారు. రూ. 10 వేల కోట్లతో మూసీపై స్కైవే నిర్మిస్తామని అన్నారు.
ఔటర్ రింగు రోడ్డుపై మరో ఇంటర్చేంజ్.. నేడు మంత్రి KTR ప్రారంభం హైదరాబాద్కి ఔటర్ రింగు రోడ్డు (ORR) ఓ మణిహారం. దీనికి ఇప్పటికే చాలా ఇంటర్చేంజ్లు ఉన్నాయి. తాజాగా మరొకటి ఈ లింకుల్లో చేరింది. నార్సింగి దగ్గర నిర్మించిన ఇంటర్చేంజ్ను ఐటీ, పురపాలక మంత్రి కేటీఆర్ ఇవాళ ప్రారంభించారు. నార్సింగి, మంచిరేవుల, గండిపేట ప్రాంతాల ప్రయాణికులకు ఈ ఇంటర్చేంజ్ బాగా ఉపయోగపడనుంది. అలాగే శంకర్పల్లి, లంగర్హౌస్ ప్రాంతాల నుంచి వచ్చే వాహనదారులు... ORRపై తమ గమ్య స్థానాలకు చేరుకునేందుకు వీలుగా ఇది ఉంది. ఈ ఇంటర్చేంజ్ ప్రారంభం కాగానే... వీకెండ్ కావడంతో... ORRపై రద్దీ పెరిగే అవకాశాలు ఉన్నాయి.