పెద్దపల్లి నియోజకవర్గం కాల్వశ్రీరాంపూర్ మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాలలో ఈ నెల 4న క్రీడా పాఠశాలల్లో ప్రవేశానికి విద్యార్థుల ఎంపిక జరుగుతుందని ఎంఈఓ రాజన్న శనివారం తెలిపారు. కరీంనగర్, ఆదిలాబాద్, హకీంపేటలలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్రీడా పాఠశాలల్లో చదివే 4వ తరగతి విద్యార్థులు 2014 సంవత్సరం జూలై 2015 ఆగస్టు మధ్యలో జన్మించి ఉండాలన్నారు. అలాగే 5వ తరగతి చదివే వారు 2013 జూలై 2014 ఆగస్టు మధ్యలో జన్మించి ఉండాలన్నారు. పరుగు పందెంతోపాటు 10 రకాల క్రీడా పోటీలు ఉంటాయన్నారు. మండల స్థాయిలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు జిల్లా స్థాయిలో ఎంపిక జరుగుతుందన్నారు. కులలం, పుట్టిన తేదీ, 3, 4 తరగతుల ప్రోగ్రెస్ కార్డులు, స్టడీ, ఆధార్ కార్డ్ సర్టిఫికెట్లతో 10 పాస్ పోర్టు ఫోటోలతో హాజరు కావాలని ఎంఈఓ తెలిపారు.