హైదరాబాద్ లో పెద్దఎత్తున్న హెరాయిన్ పట్టుబడింది. శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఈ హెరాయిన్ పట్టుబడింది. ఓ మహిళ నుంచి 5.9 కిలోల హెరాయిన్ ను స్వాధీనం చేసుకున్నారు. లభ్యమైన హెరాయిన్ విలువ రూ.41.3 కోట్లు ఉంటుందని అంచనా. కాగా, ఆ మహిళ మలావీ దేశం నుంచి హైదరాబాద్ వచ్చింది. ఈ హెరాయిన్ ను సూట్ కేసులో దాచి తరలించేందుకు ప్రయత్నించింది. డీఆర్ఐ అధికారుల తనిఖీలో ఈ హెరాయిన్ బయటపడింది. శంషాబాద్ ఎయిర్ పోర్టులో గతంలోనూ మాదకద్రవ్యాలు, బంగారం పెద్ద మొత్తంలో పట్టుబడడం తెలిసిందే.