మాదాపూర్ దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి పై నుంచి రెండురోజుల క్రితం ఆత్మహత్య చేసుకునేందుకు నీటిలో దూకిన వ్యక్తి మృతదేహం లభ్యమైంది. మృతుని జేబులో లభించిన ఆధార్ కార్డు ద్వారా నల్గొండ జిల్లా సూర్యాపేటకు చెందిన వెంకట నరసింహారెడ్డి(31) గా అతన్ని పోలీసులు గుర్తించారు. కాగా సోమవారం ఇతని మృతదేహం దుర్గం చెరువు ఒడ్డుకు రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియా హాస్పిటల్ కు తరలించారు. కాగా ఆత్మహత్యకు గల కారణాల పై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి వుంది.