రాష్ట్ర ప్రభుత్వం విద్య రంగంకు పెద్ద పీట వేస్తూ.. ప్రభుత్వ పాఠశాలలో ప్రైవేటుకు ధీటుగా అన్ని హంగులతో.. మౌలిక వసతులు కల్పిస్తుందని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. బుధవారం నకిరేకల్ నియోజకవర్గ కట్టంగూర్ మండలం రామచంద్రపురం గ్రామంలో 40 లక్షల రూపాయలతో మన ఊరు మన బడి కార్యక్రమంలో భాగంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అభివృద్ధి పనులకు శంకుస్థాన చేసి మరియు నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మండల ప్రజా ప్రతినిధులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.