కార్పొరేట్ కు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో విద్యనందిస్తున్నారని, అవకాశాలను విద్యార్థుల తల్లిదండ్రులు, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు కోరారు. బుధవారం పట్టణంలోని షాబునగర్ ప్రాథమిక పాఠశాల లో రూ 23. 57 లక్ష రూపాయలతో చేపట్టిన మన బస్తి మనబడి ని ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు, అదనపు జిల్లా కలెక్టర్ భాస్కర్ రావుతో కలిసి ప్రారంభించి మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతం చేసేందుకు మన ఊరు- మనబడి కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మక చేపట్టిందన్నారు. వేల కోట్ల నిధులతో అన్ని పాఠశాలలో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తు ఇంగ్లీష్ మీడియం విద్యను అందిసస్తున్నట్లు పేర్కొన్నారు.
అదన కలెక్టర్ భాస్కర్ రావు మాట్లాడుతూ మన బస్తీ మనబడి కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలను ఆధునీకరించడం జరిగిందని, విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు తల్లిదండ్రులు ఉపాధ్యాయులు కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో ఆర్డీవో బి చెన్నయ్య, వైస్ చైర్మన్ కుర్ర విష్ణు, ఈ ఈ మాధవి, డి ఈ వెంకటేశ్వరరావు, తహసిల్దార్ అనిల్ కుమార్, ఎంపీడీవో జ్యోతిలక్ష్మి, కమిషనర్ రవీందర్ సాగర్, ఎంఈఓ బాలాజీ నాయక్, ఏఈ ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు.