సంక్షేమ శాఖల ద్వారా స్కాలర్షిప్పులు పొందే విద్యార్థుల కొరకు తెలంగాణ ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన టీ వాలెట్ వినియోగంపై బుధవారం నల్గొండ జిల్లా మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయంలో, రాష్ట్ర ఐటీ అసోసియేట్స్ మరియు సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఇట్టి కార్యక్రమంలో సులభతరంగా స్కాలర్షిప్ అప్లికేషన్ విధానం మరియు వాలెట్ వినియోగంపై విద్యార్థులకు సవివరంగా తెలియపరిచారు. కార్యక్రమానంతరం 400 మంది విద్యార్థులు నమోదు చేసుకుని కొత్త ఎకౌంటు పొందినట్లు నిర్వాహకులు ఎం జి యు స్కాలర్షిప్ బాధ్యులు వై శేఖర్ రెడ్డి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆడిట్ సెల్ డైరెక్టర్ డాక్టర్ కొప్పుల అంజిరెడ్డి, డైరెక్టర్ అడ్మిషన్స్ డాక్టర్ ఆకుల రవి, స్టేట్ ఐటీ సెల్ ప్రతినిధులు కృష్ణ, ఫణి, సంక్షేమ శాఖ ప్రతినిధులు మురళి, తదితరులు మరియు విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.