కంటి వెలుగు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని బడంగ్ పేట మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి కోరారు. అల్మాస్గూడ 3వ డివిజన్లో మంగళవారం కంటి వెలుగు కార్యక్రమాన్ని మేయర్ ప్రారంభించి మాట్లాడారు. పేద ప్రజల జీవితాల్లో వెలుగులు నింపేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కంటివెలుగు కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. డివిజన్ లో 24 నుంచి 31వ తేదీ వరకు కొనసాగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ రామిడి మాధురీ వీరకర్ణారెడ్డి, నాయకుడు రామిడి శూరకర్ణారెడ్డి, వైద్యులు, కార్పొరేషన్ సిబ్బంది, కాలనీ వాసులు పాల్గొన్నారు.