తెలంగాణ శంషాబాద్ విమానాశ్రయంలో దుబాయ్ నుంచి వచ్చిన ముగ్గురు ప్రయాణికుల నుంచి రూ.4 కోట్ల విలువైన 7.69 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు కస్టమ్స్ అధికారులు తెలిపారు.ఒక ప్రయాణికుడు నుంచి 4.895 గ్రాముల బంగారం లభ్యమైంది. మరో ఇద్దరు ప్రయాణికుల నుంచి 2.800 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు. వీటి మొత్తం విలువ 4 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు.