నల్లగొండ జిల్లా మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గానికి జరగనున్న ఉప ఎన్నికల్లో మహాకూటమి అభ్యర్థిగా ఎంపికైన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఈ నెల 10వ తేదీన నామినేషన్ దాఖలు చేయనున్నట్లు ప్రకటించారు. కోమటిరెడ్డి కాంగ్రెస్ పార్టీకి, ఆ పార్టీ టికెట్ ద్వారా గెలిచిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో మునుగోడు ఉప ఎన్నిక జరుగుతున్న సంగతి తెలిసిందే. శుక్రవారం ఉప ఎన్నికకు నోటిఫికేషన్ వెలువడగా... శుక్రవారం నుంచి ఈ నెల 14 వరకు నామినేషన్ల దాఖలుకు గడువు ఉంది.