దసరా ఉత్సవాల్లో భాగంగా చేపట్టిన కార్యక్రమాలతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వివాదంలో చిక్కుకున్నారు. దసరా పర్వదినాన పాలపిట్టను చూస్తే మంచి జరుగుతుందనే నమ్మకం తెలంగాణలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, పండుగ రోజున చూసేందుకు ప్రగతి భవన్ కు పాలపిట్టను ముఖ్యమంత్రి తెప్పించుకున్నారు. సీఎం కోసం అధికారులు పాలపిట్టను పంజరంలో బంధించి తీసుకొచ్చారు. ఇప్పుడు దీనిపైనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘటనపై జంతు ప్రేమికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 ప్రకారం పాలపిట్టను బంధించడం నేరం. ఈ చట్టాన్ని ఉల్లంఘించిన వారు శిక్షార్హులు అవుతారు.