మునుగోడు ఉప ఎన్నికలలో టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని గెలిపించుటకు టిఆర్ఎస్ పార్టీ ఓటుకు రూ. 40 వేలు పంచడానికి సిద్ధమైందని బండి సంజయ్ అన్నారు. దీంతోపాటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి కేసిఆర్ సైతం ఆర్దిక సహాయం చేస్తున్నారని, ప్రభుత్వ వ్యతిరేక ఓటును చేర్చడానికి కాంగ్రెస్ తో కలిసి కేసిఆర్ కుట్ర చేస్తున్నారని, తెలంగాణ మంత్రులు మద్యం మత్తులో డాన్సులు వేస్తున్నారని, ఎవరిని కుట్రలు చేసినా మునుగోడులో బీజేపీ గెలుస్తుందని ఎంపీ బండి సంజయ్ కుమార్ అన్నారు.