తెలంగాణ రాష్ట్ర సంక్షేమ పథకాలపై దేశవ్యాప్తంగా రైతులు, కార్మికులు ప్రజలు ఆసక్తి చూపించడంతో సీఎం కేసీఆర్ దేశవ్యాప్త పర్యటన చేసి రైతులను, రాజకీయ నాయకులను కలిసి, వారితో చర్చించి జాతీయ రాజకీయాలలో పెను మార్పులు రావాల్సిన అవసరముందని ఒక నిర్ణయానికి వచ్చి రాష్ట్రాలలోనే కాదు దేశంలో కూడా సంక్షేమ పథకాలు రావాలని, ఆయా రాష్ట్రాల ప్రజలు కోరిక మేరకు దేశ రాజకీయాలలో రావాల్సిన అవసరమందదని సీఎం కెసిఆర్ దసరా పండుగ సందర్భంగా టిఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ (భారత్ రాష్ట్రీయ సమితి)జాతీయ పార్టీగా మార్చారని టిఆర్ఎస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి ఉప్పుతల ఏడుకొండలు అన్నారు.
చండ్రుగొండ మండల కేంద్రంలో గురువారం బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కోఆప్షన్ సభ్యులు సయ్యద రసూల్ మాట్లాడుతూ దేశానికి ఎనలేని వనరులు సంపద ఉన్న ఉపయోగించుకోకపోవడం దురదృష్ట కరమన్నారు. ఈ వేడుకల్లో బీఆర్ఎస్ నాయకులు భూపతి రమేష్, రావికంపాడు సర్పంచ్ రణయా నాయక్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు గాదె శివప్రసాద్, భూపతి శ్రీనివాసరావు, చాపలమడుగు లక్ష్మణరావు, వడ్డెర సంఘం మండల అధ్యక్షులు దండగుల సాంబశివరావు, కుక్కమూడి నాగరాజు, చాపలమడుగు నాగేశ్వరరావు, చాపలమడుగు వెంకటేశ్వరరావు, చాపలమడుగు నాగేశ్వరరావు పాల్గొన్నారు.