ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తెరాస పాలనలో ఆలయాలకు మహర్దశ : ఎమ్మెల్యే

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Oct 04, 2022, 05:29 PM

ఆధ్యాత్మిక చింతనతో మానసిక ప్రశాంతత లభిస్తుందని దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ అన్నారు. మంగళవారం నేరడుగొమ్ము మండలం పెద్దమునిగల్ తుల్జాభవాని దేవాలయంలో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఆలయాలకు మహర్దశ వచ్చిందని, సనాతన హిందూ ధర్మరక్ష పరిరక్షణ కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ విశేష కృషి చేస్తున్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని ఆలయాల అభివృద్ధి కోసం, పునర్నిర్మాణం కోసం టీఆర్ఎస్ సర్కారు కృషి చేస్తోందని అన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత ఆలయాలకు పునర్వైభవం వచ్చిందన్నారు. రాష్ట్రంలోని దేవాలయాలు సీఎం కేసీఆర్ కృషితో ఎంతో అభివృద్ధి చెందుతున్నాయని తెలిపారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com