ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మునుగోడులో ప్రచారంపై తేల్చేసిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Oct 04, 2022, 04:46 PM
మునుగోడు ఉపఎన్నికపై పార్టీలన్నీ దృష్టిపెట్టాయి. షెడ్యూల్ రావడంతో మరింత జోరు పెంచాయి. కీలక నేతలతో సమావేశాలు నిర్వహిస్తూ మునుగోడు ఉపఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహలపై చర్చిస్తున్నాయి. ఇక కాంగ్రెస్ మునుగోడు ఉపఎన్నికపై కీలక సమావేశం నిర్వహించింది. ఏఐసీసీ తెలంగాణ వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్యం ఠాకూర్ తో పాటు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, మునుగోడు అభ్యర్ధి పాల్వాయి స్రవంతిరెడ్డితో పాటు ఇతర కీలక నేతలు హాజరయ్యారు. ఈ సమావేశంలో తర్వాత పాల్వాయి స్రవంతి కీలక ప్రకటన చేశారు. కోమటిరెడ్డి ప్రచారానికి వస్తారని తనకు మాటిచ్చారని స్రవంతి చేసిన ప్రకటన కాంగ్రెస్ వర్గాలకు ఊరట కలిగించేలా ఉంది.









SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com