భూమికోసం భుక్తి కోసం వెట్టి చాకిరి విమిటి కోసం పోరాటం చేసిన వీరవనిత చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని యువత ఆదర్శంగా తీసుకోవాలని మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ వెంకటరావు పేర్కొన్నారు. చాకలి ఐలమ్మ 127వ జయంతి పురస్కరించుకొని జడ్చర్ల అంబేద్కర్, పూలే చౌరస్తాలో ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సాయుధ పోరాటానికి ఉత్తేజాన్ని నింపిన మహిళ చాకలి ఐలమ్మ అని, రజాకర్లను ఎదిరించిన దీరవనిత అని కొనియాడారు. ముందుగా కలెక్టర్ వెంకటరావు నిర్మాణంలో ఉన్న జడ్చర్ల తహసిల్దార్ కార్యాలయ భవన నిర్మాణ పనులను పరిశీలించారు. అనంతరం చాకలి ఐలమ్మ జయంతి కార్యక్రమంలో పాల్గొని నివాళులు అర్పించారు. కార్యక్రమంలో తాహాసిల్దార్ లక్ష్మీనారాయణ, జడ్పీ వైస్ చైర్మన్ యాదయ్య, తదితరులు పాల్గొన్నారు.