తెలంగాణలో సోమవారం 94 కరోనా కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 9,340 కరోనా పరీక్షలు నిర్వహించారు. గత 24 గంటల్లో రాష్ట్రంలో 105 మంది కరోనా నుంచి కోలుకోగా, ఎలాంటి కరోనా మరణాలు సంభవించలేదు. ప్రస్తుతం రాష్ట్రంలో 702 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రికవరీ రేటు 99.43 శాతంగా ఉంది. ఇవాళ హైదరాబాద్ లో 46, మేడ్చల్ మల్కాజిగిరి 7, మిగతా జిల్లాల్లో 5 లేదా అంతకంటే తక్కువ కేసులు నమోదయ్యాయి.