హైదరాబాద్ మెట్రో గ్రీన్ఛానల్ ను ఏర్పాటు చేసి నాగోల్ నుంచి జూబ్లీహిల్స్ వరకు ఓ గుండెను తరలించింది. ఎల్బీనగర్ లోని కామినేని ఆస్పత్రి డాక్టర్లు, ఇతర సిబ్బంది ఆదివారం అర్ధరాత్రి ఒంటి గంటకు నాగోల్ లోని మెట్రో స్టేషన్కు గుండెను తీసుకొచ్చారు. కేవలం 25 నిమిషాల్లోనే ప్రత్యేక రైలు ఏర్పాటు చేసి ఆ గుండెను జూబ్లీహిల్స్ చెక్పోస్టుకు తరలించారు. గతేడాది ఫిబ్రవరిలో కూడా మెట్రో ఓ గుండెను తరలించింది.