తెలంగాణలో ఎంసెట్ రెండో విడత కౌన్సెలింగ్ వాయిదా పడింది. ఇంజినీరింగ్ ఫీజుల విషయం కొలిక్కి రాకపోవడంతో ఈ నెల 28 నుంచి జరగాల్సిన కౌన్సెలింగ్ ను వాయిదా వేస్తున్నట్లు ఉన్నత విద్యా మండలి తెలిపింది. అక్టోబర్ 11 నుంచి కౌన్సెలింగ్ ప్రారంభం అవుతుందని, అక్టోబర్ 11, 12న స్లాట్ బుకింగ్, అక్టోబర్ 12న ధ్రువప్రతాల పరిశీలన, 12, 13న వెబ్ అప్షన్ల నమోదు, అక్టోబరు 16న సీట్లను కేటాయింపు ఉంటుందని తెలిపింది.