పురుగుల మందు తాగి యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఆదిలాబాద్ జిల్లా బజరహత్నూర్ మండలంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. గ్రామ పంచాయతీ పరిధిలోని చిన్నుమియా తండాకు చెందిన బనియా అర్జున్ 22 మతి స్థిమితం కోల్పోయాడు. ఈ క్రమంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగాడు. గమనించిన స్థానికులు గుడిహత్నూర్కు తీసుకెళ్లి అక్కడి నుంచి జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.