ఓడలు బళ్లు అవుతాయి, బళ్లు ఓడలు అవుతాయనే నానుడి అందరికి తెలిసిందే అచ్చం అలాంటి దృశ్యమే ఆదిలాబాద్ జిల్లాలో కనిపించింది. నింగిలో విహరించాల్సిన విమానం లారెక్కి జాతీయ రహదారిపై ప్రయాణించింది. టాటా ఏయిర్ లైన్స్ కు చెందిన A-320 ఏయిర్ బస్ విమానం మరమ్మత్తుల కోసం హైదరాబాద్ నుండి నాగపూర్ కు లారీపై ప్రయాణమైంది. నేరెడిగొండ రోల్ మామడ టోల్ ప్లాజా వద్ద లారీ పై ప్రయాణమవుతున్న విమానాన్ని చూడడానికి జనాలు ఎగబడ్డారు.