ట్విట్టర్ వేదికగా కేంద్ర ప్రభుత్వాన్ని ఉద్దేశిస్తూ కేటీఆర్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రూపాయి విలువ పతనం అవుతోందన్నారు. ఈ సమయంలో రేషన్ దుకాణాల్లో ప్రధాని మోడీ ఫొటో కోసం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెతకడం విడ్డూరంగా ఉందన్నారు. నిరుద్యోగం, ద్రవ్యోల్బణం వంటి వాటిని యాక్ట్ ఆఫ్ గాడ్ (దైవిక ఘటన)గా కేంద్రంలోని పెద్దలు భావిస్తున్నారేమోనని సెటైర్ వేశారు.