తెలంగాణ గవర్నర్ తమిళిసై విశ్వవిద్యాలయాల సందర్శన చేయనున్నారు. ఇందులో భాగంగా శనివారం రాత్రి బాసరకు రైళ్లో వెళ్లనున్నారు. ఆదివారం ఉదయం 6 గంటలకు సరస్వతి అమ్మవారిని గవర్నర్ దర్శించుకుంటారు. 7 గంటలకు బాసర ట్రిపుల్ ఐటీ వెళ్లి, విద్యార్థులతో కలిసి అల్పాహారం చేస్తారు. ఉదయం 8 నుంచి 10 గంటల సమయంలో విద్యార్థులు, ఉద్యోగులతో సమావేశం కానున్నారు. ఆమె పర్యటన అధికార పార్టీలో కాక రేపుతోంది.