తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాల్లో సిబ్బంది నియామకానికి ఉమ్మడి బోర్డు ఏర్పాటైంది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం జీవో 16ను జారీ చేసింది. యూనివర్సిటీల్లోని టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది నియామకాల ప్రక్రియను ఈ బోర్డు ద్వారా చేపట్టనున్నారు. మెడికల్ వర్సిటీ మినహా మిగతా 15 యూనివర్సిటీల్లో నియామకాలను కామన్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా భర్తీ చేయనున్నారు. కామన్ రిక్రూట్మెంట్ బోర్డుకు చైర్మెన్గా ఉన్నత విద్యామండలి చైర్మెన్ వ్యవహరించనున్నారు. బోర్డు కన్వీనర్గా కళాశాల విద్యాశాఖ కమిషనర్, సభ్యులుగా విద్యాశాఖ, ఆర్థిక శాఖ కార్యదర్శులు కొనసాగుతారు.