ఈ ఏడాది బోనాలు, జాతర ఉత్సవాలతో హైదరాబాద్ దద్దరిల్లనుంది. గత రెండేళ్లుగా కొవిడ్ కారణంగా నిరాడంబరంగా వేడుకలు చేసుకోగా ఈసారి ధూంధాంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకు అవసరమైన నిధులు కేటాయించనుంది. గోల్కొండ, లష్కర్, లాల్దర్వాజ బోనాలతో పాటు గ్రేటర్ పరిధిలోని అన్ని చోట్ల భక్తులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులను ఆదేశించారు.