చివరి శ్వాసవరకు పేద ప్రజల సంక్షేమం కోసమే దివంగత సీఎల్పీ నాయకుడు పి. జనార్థన్ రెడ్డి పనిచేశారని టీపీసీసీ చీఫ్, ఎంపీ రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రజల కోసం, పేదల సంక్షేమం కోసం సొంత పార్టీని కూడా నిలదీయడానికి పీజేఆర్ వెనకాడలేదని వ్యాఖ్యానించారు. పీజేఆర్ కుమార్తె, ఖైరతాబాద్ కార్పొరేటర్ విజయారెడ్డి ని కండువా కప్పి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. పీజేఆర్ పోరాటం వల్లే కృష్ణా జలాల్లో వాటా దక్కిందని అన్ని వివరించారు. ఆయన లేని లోటు స్పష్టంగా కనిపిస్తోందన్నారు.