ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆ ఉద్యోగ దరఖాస్తులకు నేడు చివరి రోజు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, May 26, 2022, 12:36 PM

తెలంగాణలో పోలీస్‌ ఉద్యోగాల దరఖాస్తు ప్రక్రియ నేటితో ముగియనుంది. ఈ రోజు రాత్రి 10 గంటల వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. 17, 291 ఉద్యోగాలకు పోలీస్‌ నియామక మండలి నోటిఫికేషన్లు జారీ చేయగా. ఇప్పటి వరకు దాదాపు 13 లక్షల వరకు దరఖాస్తులు వచ్చినట్లు సమాచారం.


దరఖాస్తు చేయడానికి ఇవాళే చివరి రోజు కావడంతో ఆ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ నెల 2 నుంచి చేసుకునే అవకాశం కల్పించిన పోలీస్ నియామక మండలి. వయోపరిమితిని రెండేళ్లు పెంచింది. దీంతో దరఖాస్తులు భారీగా పెరిగాయని అధికారులు తెలిపారు. మరోవైపు ఆగస్టు 7న ఎస్సై పరీక్ష, అదే నెల 21న కానిస్టేబుల్ పోస్టులకు పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com