నిత్యం ప్రజా సమస్యలపై ఎమ్మార్పీఎస్ సైనికులు పోరాడాలని, ఎమ్మార్పీఎస్ ఉద్యమాలను ఉదృతం చేయాలని ఎమ్మార్పీఎస్ అధినేత మందకృష్ణ మాదిగ పిలుపునిచ్చారు. గురువారం రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ బైపాస్ రోడ్డు వద్ద మందకృష్ణ మాదిగ నారాయణ పేట వెళ్తూ కాసేపు ఆగారు. రంగారెడ్డి జిల్లా ఎమ్మార్పీఎస్ కన్వీనర్ నరసింహ మాదిగ తదితరులు మందకృష్ణకు స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా నూతనంగా ఎంపికైన పెంటనోళ్ల నరసింహ మాదిగ, కో కన్వీనర్ తుడుం కిరణ్ మాదిగలను శాలువాతో సత్కరించారు. క్రియాశీల ఉద్యమాల్లో ముఖ్య పాత్ర పోషించాలని సూచించారు. జాతి మనుగడకు అభివృద్ధి కోసం ఎనలేని కృషి చేయాలని పేర్కొన్నారు. ఈ సందర్భంగా నరసింహ మాట్లాడుతూ. సాధారణ స్థాయి కార్యకర్తలపై మందకృష్ణ చూపిస్తున్న వాత్సల్యానికి జీవితంలో మరువలేమని అన్నారు. తనపై పెట్టిన గురుతరమైన బాధ్యతను సక్రమంగా నెరవేరుస్తామని ఈ సందర్భంగా నరసింహ తెలిపారు.