ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేసిన మంత్రి తలసాని

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, May 26, 2022, 11:55 AM

మెరుగైన, ఉచిత వైద్య సేవల కోసం ప్రభుత్వ హాస్పిటల్స్ ను ఉపయోగించుకోవాలని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. బుధవారం వెస్ట్ మారేడ్ పల్లి లోని తన నివాసంలో 30 లక్షల రూపాయల విలువైన సి ఎం ఆర్ ఎఫ్ చెక్కులను 66 మంది లబ్ధిదారుల కు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆదేశాలతో మరింత మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వ హాస్పిటల్స్ ను ఎంతో అభివృద్ధి చేయడం జరిగిందని చెప్పారు. పేద, మద్య తరగతి ప్రజలు వైద్య పరీక్ష ( TEST) ల కోసం ప్రైవేట్ ల్యాబ్ లకు వెళ్ళి వేలాది రూపాయలను ఖర్చు చేయాల్సి వస్తుందని వివరించారు.
వారిపై ఆర్దికభారం పడకుండా నివారించేందుకు ప్రభుత్వ హాస్పిటల్స్ లో కోట్లాది రూపాయల విలువైన ఎన్ఆర్ఐ, సిటీ స్కాన్, క్యాత్ ల్యాబ్ వంటి అత్యాధునిక పరికరాలను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు వివరించారు..
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ లు కొలన్ లక్ష్మి, మహేశ్వరి, హేమలత, మాజీ కార్పొరేటర్ లు అత్తిలి అరుణ గౌడ్, ఆకుల రూప తదితరులు పాల్గొన్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com