రాజేంద్రనగర్ నియోజకవర్గ పరిధిలోని మైలార్ దేవ్ పల్లి గాజుల పరిశ్రమ నుంచి మైనర్ పిల్లలను రంగారెడ్డి జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో రక్షించి వారి స్వగ్రామాలకు తరలించారు. బిహార్ కు చెందిన మైనర్ పిల్లలతో పనులు చేయిస్తున్నారని స్థానికులు జిల్లా స్త్రీ, శిశు సంక్షేమ బాలల సంరక్షణ సంస్థకు ఫిర్యాదు చేశారు. దీంతో జిల్లా సంక్షేమ అధికారి మోతీ, బాలల సంరక్షణ అధికారి ప్రవీణ్ కుమార్, సరేందర్ రెడ్డి, ఉదయరాణి ఆధ్వర్యంలో దాడులు నిర్వహించి 16 మంది చిన్నారులను రక్షించి వారిని సైదాబాద్ లోని హోమ్ కు తరలించారు. యజమానిపై కేసు నమోదు చేసి పిల్లలందరికీ 20 వేల బాండ్లను ఇప్పించి వారి స్వస్థలాలకు ఈ నెల 23న పంపించారు. 24న సాయంత్రం పిల్లలు సురక్షితంగా ఇళ్లకు వెళ్లినట్లు అక్కడి అధికారులు జిల్లా సంక్షేమ శాఖ అధికారులకు సమాచారం అందించారు.