ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జాతీయ రాజకీయ శక్తి రూపకల్పన

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, May 26, 2022, 11:43 AM
హైదరాబాద్‌ జాతీయ రాజకీయ ప్రత్యామ్నాయ శక్తి రూపకల్పనలో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ గురువారం బెంగళూరు వెళ్లనున్నారు. ఉదయం 11 గంటలకు ప్రత్యేక విమానంలో ఆయన బేగంపేట విమానాశ్రయం నుంచి బయల్దేరుతారు. మాజీ ప్రధాని దేవేగౌడతో ఆయన నివాసంలో మధ్యాహ్నం 12. 30 గంటలకు భేటీ కానున్నారు. ఈ సమావేశంలో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, దేవెగౌడ తనయుడు కుమారస్వామి కూడా పాల్గొంటారు. దేశ ప్రస్తుత రాజకీయాలు, ఇతర సమకాలీన అంశాలపై వారు చర్చించనున్నారని సమాచారం. రాష్ట్రపతి ఎన్నిక సందర్భంగా విపక్షాల ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టే అంశం, ఇందులో ప్రాంతీయ పార్టీల పాత్రపై వారు చర్చించనున్నారని తెలిసింది. గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్‌ రెడ్డి, నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి సహా కర్ణాటక సరిహద్దులోని తెలంగాణ ప్రాంత ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రి వెంట బెంగళూరు వెళ్లనున్నారు. దేేవెగౌడ, కుమారస్వామిలతో సమావేశం అనంతరం సీఎం కేసీఆర్‌ మళ్లీ సాయంత్రం హైదరాబాద్‌కు బయల్దేరి వస్తారు. ఈ పర్యటన సందర్బంగా పద్మనాభనగర్‌లోని దేవేగౌడ ఇంటి పరిసరాల్లో అభిమానులు ముఖ్యమంత్రి కేసీఆర్‌ కటౌట్లను ఏర్పాటు చేశారు.









SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com