నార్కట్ పల్లి హోటల్ వివెరా లోభువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి బుధవారం మీడియా సమావేశం నిర్వహించారు, ఉమ్మడి నల్గొండ జిల్లాకు ఓ పనికిమాలిన మంత్రిని నియమించారు ఈ అవినీతి మంత్రి ని వెంటనే మంత్రి పదవి నుండి తొలగించాలని ముఖ్యమంత్రిని డిమాండ్ చేశారు. జిల్లా మంత్రి జగదీశ్వర్ రెడ్డి భూ అక్రమాలకు , ఇసుక అక్రమ రవాణాకు పాల్పడుతున్నాడు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో రియల్ ఎస్టేట్ దందా కోసం కలెక్టరేట్ స్థలాన్ని మార్చి వందల కోట్లు సంపాదించాడు అన్నారు. ఇప్పుడు మా సొంత మండల కేంద్రమైన నార్కెట్ పల్లిలో చెరువు భూమిని కబ్జా చేసి వెంచర్ నిర్మించాలని ప్రయత్నిస్తున్నాడని దీనిపైన వెంటనే కలెక్టర్ సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.